వరద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. ..పి. ఆశన్న గారు సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు..

Published: Monday August 01, 2022
మంచిర్యాల బ్యూరో, జులై31, ప్రజాపాలన:
 
 మంచిర్యాల జిల్లా లో వరద బాధిత కుటుంబాలకు  నష్టపరిహారం  ఇవ్వాలని
..పి. ఆశన్న  సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ఆశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్) మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం  కనిగరపు అశోక్  అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై ఆయన   మాట్లాడుతూ.... రాష్ట్రంలో అతిభారీ వర్షాలు , వరదలు ఎక్కువ రావడంతో ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో జన్నారం నుండి మొదలుకొని వేమనపల్లి గోదావరికి ఇరువైపుల ఉన్న గ్రామాలను బ్యాక్ వాటర్ వరద ముంచేత్తిందని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్, రాం నగర్, ఎల్ఐసి కాలనీ , ఇతర కాలనీలు అన్ని కూడా వరదలో నీటిలో మునిగిపోయాయని తెలిపారు. ఈ వరదల్లో ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని,  ప్రజలను రక్షించాల్సిన  ప్రభుత్వం బాధ్యత రహిత్యంగా వ్యవరించిందని మండిపడ్డారు. 
అదేవిధంగా  వరదలో సర్వం కోల్పోయి బాలాజీ నగర్ కి చెందిన ఒక మహిళా తన ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు సుమారు 1 లక్ష రూపాయల నుండి 10 లక్షల వరకు నష్టపోయారని, నష్ట పోయిన ప్రజలకు న్యాయం చేయవల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీ, స్థానిక జిల్లా కలెక్టర్ మొక్కుబడిగా సందర్శించారని విమర్శించారు. నష్ట పోయిన వారి నుండి దరఖాస్తులు తీసుకున్నారు కానీ  రోజులు గడిచిన ప్రభుత్వం ఒక్కరికి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని అన్నారు. అదే విదంగా జిల్లాలో ఆదివాసీ గిరిజనులపై అటవిశాఖ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించి , పోడు భూములకు పట్టాలివ్వాలని ,అర్హులైన పేద వారికి నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను వెంటనే అప్పగించారని కోరారు. ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండా నేరుగా జిల్లా కలెక్టర్  దరఖాస్తులను పరిశీలించి ప్రతి ఒక్కరికి దళిత బందు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమాస ప్రకాష్, అశోక్, దాసరి రాజేశ్వరి, ఎర్మ పున్నం జిల్లా కమిటీ సభ్యులు  దాగం రాజారాం, దుంపల రంజిత్ కుమార్, దూలం శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.