ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Published: Monday September 20, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామానికి చెందిన దుర్గం రమణకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఆదివారం నాడు స్థానిక క్యాంపు కార్యాలయంలో అందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు అనారోగ్య కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తను పంపించిన దరఖాస్తులు అన్నింటికీ ఎంతోకొంత ఆర్థిక సహాయం అందజేస్తున్న ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు, అదేవిధంగా లబ్ధిదారులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల తెరాస అధ్యక్షుడు దత్తు మూర్తి, స్థానిక తెరాస కార్యకర్తలు, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: