కోటయ్యకు భక్త కన్నప్ప అవార్డు ప్రదానం..

Published: Tuesday June 14, 2022
తల్లాడ, జూన్ 13 (ప్రజాపాలన న్యూస్):
సీకే న్యూస్ రెండు రాష్ట్రాల ఇంఛార్జీ ఇసనపల్లి  శ్రీనివాసరావు తండ్రి కోటయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.  మా రత్తమ్మ సొసైటీ సేవా సంస్థ చైర్మన్  శ్రీనివాసరావు తన తండ్రి నేత్రాలను, శరీరాన్ని దానం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. దీంతో ఖమ్మం నేత్రానిధిసంస్థ,  కరీంనగర్ సైన్స్ కాలేజీ యాజమాన్యం  స్వచ్ఛంద సంస్థల అధినేతలు శ్రీను కుటుంబ సభ్యులకు భక్త కన్నప్ప అవార్డును అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడి అభినందించారు. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు.