సేవకై జీవించు.. సేవకై తపించు

Published: Monday March 29, 2021
మధిర, మార్చి 28, ప్రజాపాలన ప్రతినిధి : మధిర సేవా సమితిప్లాస్టిక్ నివారణ ప్రకృతి మధిర పట్టణ మున్సిపాలిటీ పరిధిలో, యాదవ బజార్ నందు మధిర సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు "ప్లాస్టిక్ నివారణ - పర్యావరణ పరిరక్షణ "నిమిత్తం"సంచులు" పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా చేయూతనిచ్చిన శ్రీ కోనా గోపాల్ రావు (మెడికల్ షాపు) ధర్మపత్ని భవాని, మరియు ధ్యాన పిరమిడ్ పత్రీజీ గారి దివ్య ఆశీస్సులతో మరియు శ్రీ కోమటిడి శ్రీనివాసరావు, ధర్మపత్ని జ్యోతి కృష్ణ, గార్ల సహకారంతో వారి చేతుల్లో మీదుగా అందజేసినారు ఈ సందర్భంగా మధిర   సేవా సమితి అధ్యక్షుడు శ్రీ పల్లపోతు ప్రసాదరావు మాట్లాడుతూ సేవా సమితి ద్వారా నిరుపేద కుటుంబాలకు సేవా కార్యక్రమం లు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ఉపాధ్యక్షులు కోమటిడి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, కోశాధికారి యర్రా లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ చారు గుండ్ల లక్ష్మి నరసింహ మూర్తి, పబ్లిక్ రిలేషన్ చైర్మన్ జాంగిర్, ముఖ్య సలహాదారులు బసవరాజు వాసుదేవరావు, (లాయర్), మరియు పెద్దలు గుమ్మ ఎలమంద, మార్తా సీతా రావమ్మ, పుచ్చకాయల సీతారామయ్య, పదిలం వీరయ్య, సంపశాల కోటేశ్వరరావు, బాజినేని నాగరాజు, పాముల రాము, పాల్గొన్నారు