సిపిఎం 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
Published: Monday November 29, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 28 ప్రజా పాలన ప్రతినిధి : ప్రజల కోసం పోరాడేది సిపిఎం పార్టీ. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో ఆదివారం ఇంటింటికీ సిపిఎం కాంపియన్ సందర్భంగా ప్రజలను విరాళాలు అందించి ఆదరించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తెలంగాణ రాష్ట్ర ౩వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సిపిఎం మాస్ ఫండ్ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి రూ.50,111/- ల విరాళాలు సేకరించటం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. సమేల్, మండల కార్యదర్శి జంగయ్య, నాయకులు గణేష్, బుగ్గరాములు, జగన్, లింగస్వామి, వెంకటేష్, రమేష్, సురేష్, ప్రభుదాస్, బిక్షపతి, వెంకటేష్, విజయమ్మ, మస్కు అరుణ, స్వప్న, ఎల్లేశ్, యాదగిరి, జంగయ్య, నర్సింహ, మల్లేష్, శ్రీను, భాస్కర్, రైతు సంఘం నాయకులు ఆమని గంటి వెంకటేష్, పోల్కంపల్లి శాఖ కార్యదర్శిలు చెరుకూరి నరసింహ, వెంకటేష్, అశోక్ నరసింహ సీపీఎం పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Share this on your social network: