నిరుపేద కుటుంబాలకు సంచులు పంపిణీ
Published: Saturday February 20, 2021
మధిర, ఫిబ్రవరి 19, ప్రజాపాలన: సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర నిరుపేద కుటుంబాలకు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం "సంచులు" పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం7 గంటల 30 నిమిషాలకు, లడక బజారు లో, 18వ వార్డు నందు శ్రీ అయ్యప్ప స్వామ దేవాలయం దగ్గర, నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ పర్యావరణాన్ని రక్షించుటకు ప్లాస్టిక్ రహితmసంచులను," 18 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి అరిగే రజని గారు మరియు మాజీ గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ డోకుపర్తి సత్యం బాబు గార్ల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపట్టినారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాద్ రావు గారు, ప్రధాన సెక్రెటరీ మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు గారు, కోశాధికారి యర్రా లక్ష్మణ్ గారు, జనరల్ సెక్రటరీ చారగుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి గారు, పబ్లిక్ రిలేషన్ చైర్మన్ జహంగీర్, ముఖ్య సలహాదారులు బసవరాజు వాసుదేవరావు, పెద్దలు కపిలవాయి జగన్ గారు, ఆవుల రామకృష్ణ గారు పాల్గొన్నారు
Share this on your social network: