హుస్సేన్ అన్యాయం మాటలు ఆపలేదు

Published: Friday March 12, 2021
మహబూబాబాద్ జిల్లా, మార్చి 11, ప్రజాపాలన ప్రతినిధి: నెల్లికుదురు మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ చేసే అటువంటి అనుచిత వ్యాఖ్యలపై నెల్లికుదురు  టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు, పార్టీ ప్రెసిడెంట్, జడ్పిటిసి, ఎంపీపీ వైస్ ఎంపీపీ, మాట్లాడుతూ మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ పై మాట్లాడే మాటలు హుస్సేన్ నాయక్ ఇకనైనా ఆపాలని జూట మాటలు ఎమ్మెల్యేపై వేయొద్దని, కోరారు టిఆర్ఎస్ పార్టీలో ఎవరు తప్పు చేసినా సహించని ఎమ్మెల్యేపై అన్యాయమైన మాటలు వద్దంటూ చర్చకు నెల్లికుదురు టిఆర్ఎస్ పార్టీ సిద్ధమంటూ నీ ఆగడాలు ఆపుకుంటే మంచిదని కోరారు ఈ సమావేశంలో పార్టీ ప్రెసిడెంట్ పరపాటి వెంకట్ రెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు బాలాజీ నాయక్, ఆర్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్, బిక్కు నాయక్, భీముడు,బంగాళ ఈశ్వర్ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు