ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగించుకోవాలి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

Published: Monday October 17, 2022
మేడిపల్లి, అక్టోబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి సూచించారు.
ఉప్పల్ డివిజన్లోని మల్లికార్జున నగర్ కాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ డయాగ్నోస్టిక్  సౌజన్యంతో ఆదివారం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రంగ రెడ్డి ,సత్తి రెడ్డి ,పద్మావతి కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, డా శంకర్ ముతినేని, డా ఎన్ సుకుమార్, డా డి రాకేష్ నాయక్, డా శ్వేతా దొంగరి,డా సుభాష్ గట్టు, డా దివ్య మేకల, డా రుచి ఆరోర్,  సల్ల ప్రభాకర్ రెడ్డి, హనుమంతు,రఘు,ప్రశాంత్, బంటి తదితరులు పాల్గొన్నారు.