రాష్ట్ర టాపర్ కు విద్యామంత్రిచే సన్మాన ఆసిఫాబాద్ జిల్లా, సెప్టెంబర్ 29, ప్రజాపాలన, ప్రతినిధి:

Published: Friday September 30, 2022
కేబి ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి జెల్లా అమాన్ ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమార్ జలీల్ ఘనంగా సత్కరించారని జిల్లా మాధ్యమిక విద్యాధికారి (డిఐఈఓ) శ్రీధర్ సుమన్  గురువారం తెలిపారు. ఇంటర్ బోర్డు పరీక్షల్లో ఎంపీసీ గ్రూప్ నుండి 1000 మార్కులకుగాను 990 మార్కులు సాధించిన కాగజ్ నగర్ వాసి జెల్ల అమన్ రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచారని విద్యార్థిని ఇంటర్ కమిషనర్ సముచిత రీతిలో సత్కరించడానికి నిర్ణయించారని, అందులో భాగంగా  రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఎస్పీ ఈ ఆర్డి భవనంలోని గోదావరికాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభావంతుడైన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను నగదు బహుమతి, శాలువా మరియు సర్టిఫికెట్తో సన్మానించారు. జెల్లా అమన్ రాష్ట్ర స్థాయిలో సత్కారం పొందటం ఆసిఫాబాద్ జిల్లా కే గర్వకారణమని డిఐఈఓ శ్రీధర్ సుమన్ ప్రశంసించారు.