*పేదలు ఉచిత న్యాయంపొందే అవకాశంఉంది. రామకృష్ణాపూర్. నవంబర్ 9. ప్రజా పాలన ప్రతినిధి.*
Published: Thursday November 10, 2022
పేదలు ఉచిత న్యాయం పొందే అవకాశం ఉందని అడ్వకేట్, క్లాస్ డైరెక్టర్ రాజలింగు మోతె అన్నారు. బుధవారం జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలో సెంటర్ ఫర్ లీగల్ లైట్స్ అండ్ సోషల్ అవేర్నెస్(క్లాస్ ) ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సమాజంలో న్యాయం కు దూరంగా ఉన్నబలహీన వర్గాలకు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం వారికి న్యాయ సహాయం చేయడం కోసం క్లాస్ పనిచేస్తుందన్నారు.
కార్యక్రమంలో ప్రజలు మరియు యువత పాల్గొన్నారు.
Share this on your social network: