వంకాయగూడెంలో వివాహిత మిస్సింగ్

Published: Monday February 27, 2023
శంకరపట్నం ఫిబ్రవరి 26 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి చెందిన వివాహిత(27) అదృశ్యం పై కేసు నమోదు  చేసినట్లు ఎస్సై దేశ్ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. శుక్రవారం ఉదయం భర్త బయటికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో తన భార్య లేకపోవడంతో బంధువులను చుట్టుపక్కల వారిని విచారించినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో భర్త కేశవపట్నం పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేయడంతో  ఎస్సై దేశ్ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.