నవరాత్రి ఉత్సవాల్లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నంద
Published: Thursday October 06, 2022
బోనకల్ ,నవంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో దేవి నవరాత్రులు సందర్భంగా అమ్మవారి మండపం లో కనకదుర్గమ్మ తల్లి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత మధిర శాసన సభ్యులు మల్లు భట్టివిక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క హాజరయ్యారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాఅన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు నందిని మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బిసి సెల్ అధ్యక్షుడు కందుల పాపారావు,సోసైటి చైర్మన్ కర్నాటి కోటి,గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపిటిసి, గ్రామ పెద్దలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: