ఇంత్యక్రియలకు ఆర్థిక చేయూత
Published: Tuesday November 08, 2022
మర్పల్లి మండల జడ్పీటీసీ పబ్బే మధుకర్
వికారాబాద్ బ్యూరో 7 నవంబర్ ప్రజా పాలన : అనారోగ్యంతో మృతి చెందిన ఏముల లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూత అందించామని మర్పల్లి మండల జడ్పిటిసి పబ్బే మధుకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామానికి చెందిన ఏముల లక్ష్మయ్య అకస్మాత్తుగా మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంత్యక్రియలు నిర్వహించుటకు ఐదువేల రూపాయలను మృతుని కుటుంబ సభ్యులకు మర్పల్లి మండల ఉపాధ్యక్షుడు దేవరదేశి అశోక్ ద్వారా అందజేశారు.
Share this on your social network: