గొట్టిముక్కల గ్రామంలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Published: Friday May 20, 2022
వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య
వికారాబాద్ బ్యూరో 19 మే ప్రజా పాలన : ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య హితవు పలికారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ రైతులు ఆంజనేయులు, అనంతయ్య పొలాలలో భూమి చదును పనులు పరిశీలించి తగు సూచనలు చేశారు. పనులన్నియు మెజర్మెంట్ ప్రకారము చక్కగా పూర్తి చేయాలని సూచించారు. 350కు పైగా ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామ్ రెడ్డి ,టెక్నికల్ అసిస్టెంట్ నర్సింలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ నవీన్, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. తదుపరి గొట్టిముక్కల గ్రామం నర్సరీని పరిశీలించారు.
మొక్కలు ఏపుగా పెరిగేలా కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. 15000 మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.