మస్జీద్ కు ఏసీ వితరణ
Published: Friday April 23, 2021
మధిర, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : మధిర స్విమ్మర్స్ అషోషియేషన్ అధ్యక్షులు జంగా నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టణంలోని రాయపట్నం రోడ్డులో గల జామియా మస్జీద్ (మర్కజ్) కు వేసవి ఎండల దృష్ట్యా లాయిడ్ కంపెనీ ఎయిర్ కండిషనర్ ను షేక్ ఇంతియాజ్ అలీ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మధిర స్విమ్మర్ షేక్ ఇక్బాల్ పాషా (కలర్స్) వారు మస్జీద్ కమిటీ అధ్యక్షులు షేక్ మహమ్మద్ ఖాసిం గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్మర్స్ అషోషియేషన్ ఉపాధ్యక్షులు చల్లా సత్యనారాయణ, స్విమ్మర్ లు చెరుకూరి కృష్ణారావు, వేముల ఆంజనేయులు, జానకి రామ్ రెడ్డి, భూక్యా హనుమ, ఆవుల సంతోష్ కుమార్, ఆదాము, మస్జీద్ కమిటీ సభ్యులు మహమ్మద్ మొహిద్దీన్, షేక్ కరీమ్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
Share this on your social network: