గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన యండియర్ ఫౌండేషన్..

Published: Monday May 31, 2021
పటాన్చేరు, మే 30 ప్రజాపాలన ప్రతినిధి : మండలం భానూర్ గ్రామ పరిధిలో మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొని సుమారు 45 సం రాల వయస్సు గల వ్యక్తి మృతి చెందగా, సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు రాకపోవడంతో, సమాజంలో ఎటువంటి విషయంలో అయిన సహాయం కోసం మా ఫౌండేషన్ సమాచారం వస్తే ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు వస్తామని యండిఆర్ ఫౌండేషన్ సబ్యులు తెలిపారు, యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ఆర్థిక సహకారంతో ఆ వ్యక్తికి ప్రెసిడెంట్ మధు, ప్రవీణ్, చోటు(అశోక్), అసిఫ్ లు అంత్యక్రియలు నిర్వహించరు...