చిరునోముల లో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు

Published: Wednesday February 09, 2022
బోనకల్, ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి : దేశవ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చిరునోముల గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నీ మండల సభ్యత్వాలు కార్యక్రమం ఇంఛార్జి కర్నాటి రామకోటేశ్వరరావు, చిరునోముల గ్రామ సర్పంచ్ ములకారపు రవితో కలసి పర్యవేక్షణ చేశారు. కర్నాటి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల బీమా పార్టీ కల్పిస్తుందని గ్రామాల్లో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు సభ్యత్వం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బూత్ ఎన్రోలర్లు సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శాస్త్రి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు మర్పల్లి ప్రేమ్ కుమార్, ఉప సర్పంచ్ ఆముదాల పుల్లారావు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య భద్రు నాయక్, జిల్లా యూత్ నాయకులు బండి పవన్, ఆకుల గోపి జనప్రియా కుమార్, తదితరులు పాల్గొన్నారు.