*కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బి జె పి మోడీ ప్రభుత్వం* -బడుగు బలహీన వర్గాల కోసం పెరుగ

Published: Thursday December 29, 2022

చేవెళ్ల డిసెంబర్ 28, (ప్రజాపాలన):-

చేవెళ్ల మండలంలోని రామన్నగూడెం గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వారోత్సవాలు  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ కే రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం ముఖ్య అతిథులుగా పాల్గొని   జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని మైనారిటీలపై దాడులు పెరిగాయని రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మహిళలపై రోజు దాడులు జరుగుతున్నాయని మతోన్మాదం పెట్రేగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీకి భవిష్యత్తులో బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దోబూచులాడుతుందని భారత కమ్యూనిస్టు పార్టీ టిఆర్ఎస్ తో పొత్తు ఉన్న పోరాటాలు మాత్రమే ఆగవని పేద బడుగు బలహీన వర్గాల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారు అన్నారు 98వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన వాడ వాడాలా కమ్యూనిస్టు పార్టీ జెండా ఎగరాలని నూతన సభ్యత్వం కార్యకర్తలు అందరూ తీసుకోవాలని ప్రజాసంఘాలను బలోపేతం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వడ్ల సత్యనారాయణ మండల పార్టీ కార్యదర్శి మల్ గారి సత్తిరెడ్డి సహాయ కార్యదర్శి ఎం డి మక్బుల్ మొయినాబాద్ మండల పార్టీ కార్యదర్శి శ్రీనివాస్, జలీల్ శ్యామ్ ఏఐటియుసి మండల అధ్యక్షుడు గ్రామ కార్యదర్శి చిట్టెంపల్లి శివ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వడ్ల మంజుల విజయమ్మ మీనాక్షి గ్రామ కార్యకర్తలు బి కృష్ణయ్య సిహెచ్ శంకర్ వడ్డే నరసింహులు డి మల్లేష్ రుక్కమ్మ లలిత సిహెచ్ విఠలయ్య పరమేశ్వరి బాలరాజ్ రఫీ తదితరులు పాల్గొన్నారు