బోనకల్ నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక.

Published: Thursday October 14, 2021
బోనకల్, అక్టోబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండల కేంద్రంలో 20 మంది కమిటీ సభ్యులతో నూతనంగా ప్రెస్ క్లబ్ఎన్నికసోమవారం నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులుగా ఆకెన పవన్, (ప్రజాపక్షం), మంద సత్యానందం (మనం), ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు గౌరవ అధ్యక్షులు సలహాదారులుగా శ్రీనివాస్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మదార్ సాహెబ్ (సమయజ్యోతి), ఉపాధ్యక్షులుగా బాజి షరీఫ్ (ప్రజాసాక్షి) వై శ్రీనివాస్ (జనంసాక్షి) సహాయ కార్యదర్శులుగా భూక్య శ్రీను (ప్రజాపాలన), వేలాద్రి (ప్రజాజ్యోతి), కోశాధికారిగా నాగేశ్వరరావు (మెట్రో), కమిటీ సభ్యులుగా  గోపాలకృష్ణ (వెలుగు), ఎస్. వి.వి. బ్రహ్మ ఆంజనేయులు (మెట్రో ఈవెనింగ్), లక్ష్మీనారాయణ (క్రమశిక్షణ), రామచంద్ర రావు (న్యూస్ భూమ్), అమరయ్య (మీడియా టుడే), నవీన్ (మోహన జ్యోతి), (ప్రజా కలం) తెల్లకుల శ్రీనివాసరావు తదితరులు ఎన్నికయ్యారు.