ఏ ఎన్ ఎం మధురిమకు కరోనా వారియర్ అవార్డు

Published: Thursday May 27, 2021
కోరుట్ల, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి):కోరుట్ల పట్టణంలో ఏ ఎన్ ఎం గా విధులు నిర్వహిస్తున్న గాండ్ల మధురిమ కరోనా విజృంభణ సమయంలో చేపట్టిన సేవలను గుర్తించి ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఆమెను కరోనా వారియర్ అవార్డుకు ఎంపిక చేసి ప్రశంసా పత్రాన్ని పంపించగా బుధవారం రోజున డాక్టర్ సమీయొద్దీన్ చేతుల మీదుగా మధురిమ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ సమీయొద్దీన్ మాట్లాడుతూ అవార్డు గ్రహీత మధురిమ  ఏ ఎన్ ఏం గా వృత్తి రంగంలో ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా తాను ఎంచుకున్న బాటలో సేవే పరమావధిగా కొనసాగడం అభినందనీయమని, సేవా రంగంలో నేటి మహిళామణులకు ఆదర్శంగా నిలిచిన మధురిమ కు కరోనా వారియర్ అవార్డు రావడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అశోక్ బాబు, డాక్టర్ సమీనా తబస్సుమ్, ధనుంజయ్, రామ్ మోహన్ తదితరులు పాల్గొని మధురిమ కు అభినందనలు తెలియపరిచారు.