ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Wednesday April 05, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కంటివెలుగు శిబిరంలో ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకుని కళ్ళద్దాలు తీసుకోవాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ బుద్ధ నగర్ కమ్యూనిటీ హాల్లో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ 
భీం రెడ్డి నవీన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ లతో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి  ప్రారంభించారు. డివిజన్లోని ప్రజలందరూ కంటి వెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ నవీన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అమర్ సింగ్,డీఈఈ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ జానకి,నాయకులు పెంటయ్య గౌడ్,పప్పుల అంజిరెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి,బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల వైద్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.