అప్ డేట్ చేయడం ద్వారా ఆధార్ మరింత శక్తివంతం ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Wednesday November 02, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 1 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఆధార్ కార్డును అప్డేట్ చేయడం ద్వారా మరింత శక్తివంతంగా మార్చవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో ఆధార్ అప్డేట్ సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం పొందిన ఆధార్ కార్డు అప్డేట్ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలును  పొందడం సులభతరం అవుతుందని తెలిపారు. ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం కింద లబ్ధిదారులు దేశంలో ఎక్కడి నుండైనా రేషన్ పొందవచ్చని, బ్యాంకు ఖాతాను గెలవడం సులభతరం అవుతుందని, మొబైల్ సిమ్ కార్డు, వివిధ స్కాలర్షిప్ పథకాలను పొందేందుకు  సౌలభ్యమని తెలిపారు. దాదాపు 1 వెయ్యి ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల వయోజనాల లబ్ధి పొందవచ్చుని, అన్నారు. ఈ కార్యక్రమంలోఈడీఎం గౌతమ్,గడ్డల సురేష్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.