భీమన్నజాతరఉత్సవాలు

Published: Saturday February 04, 2023

రాయికల్, ఫిబ్రవరి 03 (ప్రజా పాలన ప్రతినిధి); రాయికల్ పట్టణంలొ ఈ నెల 5   ఆదివారం నుండి 7 మంగళవారం వరకు భీమన్న జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు  ఆలయ కమిటీ నాయకులు దేవుని నర్సయ్య- నవ్య  తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం పౌర్ణమి రోజు రాత్రి భీమేశ్వరస్వామి కళ్యాణం (డోలోత్సవం),సోమవారం రోజు న స్వామివారి దర్శనం ,అన్నదానం ,సా౦స్క్రతి కార్యక్రమాలు ,మంగళవారం రోజున భీమేశ్వరస్వామివారి రథోత్సవ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు.జగిత్యాల జిల్లాలోని  జగిత్యాల ,మేడిపల్లి ,కోరుట్ల ,మెట్ పెల్లి, సారంగపూర్,మల్లాపూర్ మండలాల నుండి భక్తులు హాజరవుతారని,భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు .ఈ కార్యక్రమంలో  దేవుని నరసయ్య ,ఆలయ కమిటీ నిర్వాహకులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు .