టిపిసిసి అధ్యక్షుని ఎన్నిక పట్ల హర్షం

Published: Tuesday June 29, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నిక పట్ల మండల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, ఎంపీపీ నూతి రమేష్ రాజులు మాట్లాడుతూ ఏఐసిసి ఆదేశాల మేరకు టిపిసిసి అధ్యక్షుని రేవంత్ రెడ్డి ని  నియమించడం సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తారని, వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లక్ష్యంగా ముందుకు సాగుతుందని, భువనగిరి నియోజకవర్గంలో అందరం కలిసి కట్టుగా పని చేస్తామని, వచ్చే సాధారణ ఎన్నికల్లో భువనగిరి గడ్డ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ బోల్ల లలిత శ్రీనివాస్, ఉలిపే మల్లేశం, బెలిదే  నాగేశ్వర్, గారిసే రవి, పల్లెర్ల రాజు, కాసుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు