రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం 75 సంవత్సరాలు వజ్రోత్సవాలు సంబరాలు ఘనంగా నిర్వహించారు

Published: Monday September 12, 2022

 

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధిరాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం(STUTS) రంగారెడ్డి జిల్లా 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాల సంబరాలు ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉపాధ్యాయులతో మాట్లాడుతూ 75వ సంవత్సరాలు వజ్రోత్సవాలు పూర్తిచేసిన సందర్భంగా నియోజవర్గంలోనే ప్రతి ఒక్క స్కూల్లో విద్యార్థులచే కార్యక్రమాలు కొనసాగించిన ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు, భారతదేశంలో కన్వీనియరు గాని రీతిలో ఈ జండా కార్యక్రమం ముమ్మారంగ సాగిందని  కార్యక్రమానికి ముఖ్య పాత్ర పోషించిన ఉపాధ్యాయులు గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ అవగాహన  కల్పించి నువ్వు వెన్నెల జెండా ప్రతి ఇంటి మీద ఎగరేలా ప్రతి ఒక్కరు కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కృపేష్, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ అధ్యక్షులు సదానందం గౌడ్, స్టేట్ టీచర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రాజమణి, STUTS సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.