రాథోడ్ రమేష్ కు ఘన స్వాగతం పలికిన మురిమడుగు గ్రామస్తులు
Published: Monday January 23, 2023
జన్నారం, జనవరి 22, ప్రజాపాలన: మండలంలోని మురిమడుగు గ్రామంలో కడప గడపకు వెళ్లి బీజేపీ ప్రజాగోస భరోస యాత్రలో భాగంగా ఆదివారం రమేష్ రాథోడ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని తెలిపారు. గ్రామంలో యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మురిమడుగులో ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో బుర్ర గడ్డ జగన్, పవన్, బీజేపీ మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this on your social network: