ఎర్రబెల్లి గూడెం లో సివిల్స్ రైట్స్ సమావేశం

Published: Wednesday March 31, 2021
హాజరైన తాసిల్దార్ రమేష్ కుమార్,ఎస్సై జితేందర్ 
నెల్లికుదురు మార్చి 30(ప్రజాపాలన)మండలంలోని ఎర్రబెల్లి గూడెం లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాసిల్దార్ అనంతుల రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సివిల్స్ రైట్స్ కార్యక్రమం నిర్వహించారు.దీనికి ఎస్ ఐ పి జితేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అనంతుల రమేష్, కుమార్ ఎస్సై పి జితేందర్ లు మాట్లాడుతూ.. ప్రతి పౌరునికిచట్ట పరిధిలో స్వేచ్ఛగా జీవించేహక్కు ఉంటుందన్నారు. మానవ హక్కులకు ఎవరు భంగంకలిగించకూడదని, ఎవరి పరిధిలో వారు చట్టాన్ని అతిక్రమించ కుండా ఉండాలన్నారు. అస్పృశ్యత అంటరానితనం లకు తావులేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మెర అశోక్ గౌడ్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు స్థానిక ఎంపీటీసీ బత్తిని అనిల్ గౌడ్ ఆర్ ఐ  మల్లయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు