ధారూర్ ఏఎంసి నూతన చైర్మన్ గా ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా

Published: Friday September 24, 2021
వికారాబాద్ బ్యూరో 23 సెప్టెంబర్ ప్రజాపాలన : ధారూర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తాను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం సంవత్సర కాలపరిమితితో విధులు నిర్వహించనున్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా అవుసుపల్లి అంజయ్యను నియమించారు. మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ సభ్యులుగా సబావత్ రాంశెట్టి నాయక్, బిపాషా బేగమ్, జాని వెంకటయ్య, పట్లోల్ల నర్సింహారెడ్డి, కుర్వ చంద్రయ్య, మస్తి రాములు, టి.లక్ష్మప్ప, పి.శ్రీనివాస్, ధారూర్ (గ్రామం మరియు మండల్) ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వికారాబాద్, ధారూర్ గ్రామ సర్పంచ్ లను సభ్యులుగా కొనసాగేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. పార్టీ శ్రేయస్సు కొరకు అహర్నిశలు కృషి చేసిన వారికి అధినాయకత్వం తప్పక గుర్తిస్తుందని అన్నారు. ధారూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టుటకు సహకరించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించి నన్ను ప్రోత్సహించిన నా శ్రేయోభిలాషులకు, హితైశులకు శుభాభివందనాలని ఉద్ఘాటించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు సవినయంగా సావధానంగా వింటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏ రైతు పట్ల వివక్షను చూపకుండా సమదృష్టితో న్యాయం చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.