*నేటి యువతకు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శం* *సి పి ఐ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు*
చేవెళ్ల ఏప్రిల్ 5, (ప్రజా పాలన):-
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు 116వ జయంతి ఉత్సవాలను చేవెళ్ల మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ కు సి పి ఐ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సిపిఐ చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ కే రామస్వామి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రబులింగం సిపిఐ మండల కార్యదర్శి మల్గని సత్తిరెడ్డి సత్తిరెడ్డి గార్లతో పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఒక జగజీవన్ రావ్ ఆదర్శ పురుషుడని కాంగ్రెస్ నాయకుడైన ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు చేసిన మహాత్ముడని భారత అమూల్య రత్నమని వారు కొనియాడారు ఆయన సుదీర్ఘకాలం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి బడుగు బలహీన వర్గాలను ఎనలేని సేవ చేసిన మహానీయుడని వారు కొనియారారు అత్యంతమైన పార్లమెంటరీ అని మూడు దశాబ్దాల పైన కేంద్ర మంత్రిగా గొప్ప మేధావిగా ఒప్పించే గుణము ఆత్మవిశ్వాసము ధైర్యము గల వ్యక్తిత్వమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల అధ్యక్షురాలు వడ్ల మంజుల విజయమ్మ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: