చెర్లకొండాపూర్ గ్రామంలో పర్యటించిన ఎం.పీ.డీవో
Published: Wednesday February 02, 2022
రాయికల్, ఫిబ్రవరి 1 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలం కొండాపూర్ గ్రామంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి గంగుల సంతోష్ కుమార్ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న నర్సరీని పరిశీలించారు. దానిలో పెంచుతున్న మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి రికార్డులను పరిశీలించి కార్యదర్శికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల రాజ్యలక్ష్మి లక్ష్మీనారాయణ కార్యదర్శి, వార్డు మెంబర్లు మిగతా సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: