ఎంఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి గూడవాసి ముత్యాల శివకృష్ణ

Published: Monday October 11, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : త్వరలో జరగబోయే ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కోసం జరిగే ఎంఎస్ఎఫ్ సన్నాహక సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జి లను  ప్రకటించింది. ఇబ్రహింపట్నం నియోజక వర్గం ఇంఛార్జి గా ఎంఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు తాలపల్లి గూడ వాసి ముత్యాల శివ కృష్ణ ను నియమించి నియామక పత్రం అందించడం జరిగింది. గతంలో నియోజకవర్గంలో ప్రైవేట్ యూనివర్సిటీలను వ్యతిరేకిస్తూ మహా జనస్ విద్యార్థి పాదయాత్రను చేసిన వ్యక్తిని ఇంఛార్జిగా ప్రకటించి నందుకు ఎంఆర్ పిఎస్ అనుబంధ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. మహా సభలు జరుగుతాయని జయప్రదం చేయాలని కోరారు.