సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Tuesday June 08, 2021

బెల్లంపల్లి, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గ తాండూర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణ ఇటీవల మరణించినందున సోమవారం నాడు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వారి ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు, ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి సందర్భంలోనే మనోధైర్యంతో ధైర్యంగా ముందుకు పోవాలని అన్నారు, సత్యనారాయణ మృతి చెందడం మీ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీకి ఎంతో నష్టం వాటిల్లిందని మనం ఆనష్టాన్ని పూడ్చలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ప్రణయ్, జడ్పీటీసీ సాలిగామ బాణయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.