ప్రమాదవశాత్తుతో మరణించిన స్నేహితుని కుటుంబానికి మిత్రుల ఆర్థిక సహాయం

Published: Thursday September 29, 2022

రాయికల్, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన కోరుకొండ రాజు (24) అనే యువకుడు గత కొన్ని రోజుల క్రితం (వినాయక నిమజ్జనం సందర్భంగా) విద్యుత్ షాక్ తో మరణించాడు.ఆ కుటుంబానికి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్న, అతని తో చదువుకున్న మిత్రులు 1,11,900/-  రూ:లు (పదవ తరగతి బ్యాచ్ 50 వేల100/-, ఇంటర్ బ్యాచ్ 41800/-, డిగ్రీ బ్యాచ్ 14000/-, శివసేన యూత్ రేచపల్లి 6000/- రూ:లు)ఆర్థిక సాయం చేశారు. ఆ కుటుంబానికి ఉన్న ఒకగానొక్క కొడుకును కోల్పోయినందుకు మిత్రుని తల్లిదండ్రులకు ఎంత కష్టం వచ్చినా మేమంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు.