క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ యువజన విభాగం 23 మందితో పూర్తి కమిటీ ఏర్పాటు

Published: Sunday October 10, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 09, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,  తెరాస రాష్ట్ర యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల అనుమతితో తెరాస పార్టీలో యువత బలోపేతంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం 23 మందితో పూర్తి కమిటీని ప్రకటించారని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెరాస పార్టీ యువజన విభాగం నూతన  అధ్యక్షుడు  జెర్కొని రాజు ముదిరాజ్ పేర్కొన్నారు. ఎన్నికైన వారిలో యువజన విభాగం అధ్యక్షుడు జెర్కొని రాజు, వైస్ ప్రెసిడెంట్ కందాడ సురేందర్ రెడ్డి, మహ్మద్ కాజూబాయ్, దారు రాఘవేందర్, జనరల్ సెక్రటరీ మొగుళ్ల జీవన్ రెడ్డి, సి హెచ్ మహేష్, మోటే శ్రీశైలం, కప్పరి రాజు, నాలమోగుల్ల మధు, వలవొజు సాయి, మహేందర్ యాదవ్, ఆనంద్, అందే ఆనంద్, చింతకింది వీరీష్, శశికాంత్ రెడ్డి, కొత్త గణేష్ గౌడ్, పాతూరి రాజేష్ గౌడ్, కంబాలపల్లి బాలు, పండాల వినయ్ గౌడ్, శ్రీరామ్ యాదవ్, పాలడుగు నాగరాజు, నిఖిల్ రెడ్డి, మందుల రఘుపతి తదితరులు మండలాలు మున్సిపాలిటీలనుండి యువజన విభాగం అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక కావడం జరిగిందని తెలిపారు.