అక్రమ అరెస్టును ఖండించిన మండల కాంగ్రెస్ నాయకులు

Published: Friday June 17, 2022

బోనకల్, జూన్ 16 ప్రజాపాలన ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ ,రాహుల్ గాంధీలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమంగా ఈడి కేసులు పెట్టడంపై నిరసన గా గురువారం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు సిఎల్పి నాయకులూ భట్టి విక్రమార్క పిలుపు మేరకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు మార్గ మధ్యలో అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి దుర్గారావు, డిసిసి కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా భద్రు నాయక్, బోనకల్ గ్రామ శాఖ అద్యక్షుడు మరీదు శ్రీను,మండల సేవాదళ్ అద్యక్షుడు చింతేటి సురేష్,బిసి సెల్ మండల అద్యక్షుడు కందుల పాపారావు తదితరులు ఉన్నారు