ఎక్కడ సమస్య ఉన్న అందుబాటులో ఉంటా : కార్పొరేటర్ పుష్పనాగేష్

Published: Thursday May 20, 2021
రామచంద్రపురం, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : రామచంద్రపురం డివిజన్లలో ఎక్కడ సమస్య ఉన్న అందుబాటులో ఉంటనాని కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనాగష్ అన్నారు.ఈరోజు రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 10, 11, 12 బ్లాక్ లలో ఉన్న కరోనా బారిన పడిన కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వంచే ఇవ్వనున్న కోవిడ్ మెడికల్ కిట్ మరియు ఫుడ్ ను పంపిణి చేశారు, ఆమె మాట్లాడుతూ ఎవ్వరు భయపడవద్దు అని తగిన జాగ్రత్తలు తీసుకొని మందులు వాడి, వ్యాయామం చేసి,తగిన పౌష్టిక ఆహారం తీసుకుంటే త్వరలోనే కొలుకుంటారని ఆమె వారి కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. అనంతరం ప్రతి ఒక్క ఇంట్లో, ఇంటి బయట సోడియం హైపో క్లోరైట్ ను పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో  ఏంటమలజీ సూపర్వైసర్ ఇజాజ్, మల్లికార్జున, సుధాకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.