మహాంకాలి అమ్మవారిని దర్శించుకున్న కోతకుర్మ మంగమ్మ శివకుమార్

Published: Monday July 26, 2021

ఇబ్రహీంపట్నం, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో శ్రీమాన్ మహంకాళి బోనాల జాతరకు ఆదివారం విచ్చేసిన తుర్కయంజాల్ కౌన్సిలర్. రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్ ల ఫోరం జిల్లా అధ్యక్షురలు కొత్త కుర్మా మంగమ్మ, కాంగ్రెస్ పార్టీ టిపిసిసి కార్యదర్శి కొత్త కురుమశివకుమార్ దంపతులు. కుటుంబసమేతంగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్ మాట్లాడుతూ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ప్రతి ఒక్కరూ కరోన నిబంధనలు పాటించి బోనాల ఉత్సవాలను జయప్రదం చేయాలని, అమ్మవారి కృపాకటాక్షాలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నామని ఈ కార్యక్రమంలో పదో వార్డు కౌన్సిలర్ అనురాధ దర్శన్ యశ్వంత్ గౌడ్ పాల్గొన్నారు.