పేదల పెన్నిధి సిఎంఆర్ఎఫ్

Published: Monday February 14, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 13 ఫిబ్రవరి ప్రజాపాలన : పేదలకు కార్పోరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా సిఎంఆర్ఎఫ్ అండగా ఉంటున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన రూ.4,46,500 విలువగల 9 సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన పేదప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించడంలో సిఎంఆర్ఎఫ్ ఎంతగానో తోడ్పాటును అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాలె లక్ష్మణ్ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.