ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి *మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసిన నూతన మార్

Published: Saturday January 07, 2023
నూతనంగా ఎంపికైన ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ  పాలకవర్గం చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్ రెడ్డి, 14 మంది డైరెక్టర్ లు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచి రెడ్డి కిషన్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని అభినందించి  శుభాకాంక్షలు తెలిపారు.  రైతులకు మార్కెటింగ్ సేవలు మరింత చేరువ చేయడానికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని సూచించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి మరింత మంచి పేరు తేవడానికి మార్కెట్ కమిటీ సభ్యులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పాశం రవీందర్ గౌడ్, బుట్టి రాములు, మొగిలి పావని, తలారి మల్లేష్, నేనావత్ శంకర్ నాయక్, నారి యాదయ్య, మహమ్మద్ జానీ పాషా, మంగ వెంకటేష్, ఆడాల గణేష్  కాయితి వెంకట్ రెడ్డి, మిర్యాణం  కిరణ్ కుమార్, ఎర్రమల్ల  శ్రీనివాస్, కిరణప్ప, తదితరులు పాల్గొన్నారు.