రామ్మోహన్ కు నివాళులు అర్పించిన మట్టా దయానంద్..

Published: Thursday June 16, 2022
తల్లాడ, జూన్ 15 (ప్రజాపాలన న్యూస్): 
 తల్లాడ పట్టణానికి చెందిన వేమిశెట్టి రాం మోహన్ రావు  దశ దీన కర్మకు టిఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర రావు, దుండేటి వీరారెడ్డి, గణేషుల రవి, పొట్టేటి బ్రహ్మరెడ్డి, ఎర్రి నరసింహారావు, తుమ్మలపల్లి రమేష్, లచ్చిరెడ్డి, ఆళ్లకుంట నరసింహారావు ఉన్నారు.