రైతుల సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర మంత్రి, జడ్పీ చైర్మన్

Published: Tuesday December 06, 2022

 బోనకల్, డిసెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి: మండలానికి చెందిన పలువురు రైతులు సాగర్ నీటి సమస్యను పరిష్కరించాలని కోరగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు చొరవతో ఎస్సార్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, దృష్టికి తీసుకెళ్లారు.ఖరీఫ్ సీజన్ అయిపోయినందువలన రబి పంటకు 15 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తారనీ మంత్రి అజయ్ కుమార్ వారికి తెలియజేశారు.రైతులు పత్తి పంటను పీకి కొత్తగా మొక్కజొన్న పంట వేసుకోవడానికి సమయం లేదనీ, కాబట్టి మంత్రి ఖమ్మం , నల్లగొండ సీఈవోలతో మాట్లాడగా మూడున్నర టీఎంసీల నీటి సరఫరాకు ఆమోదం తెలిపినారనీ వారు అన్నారు. రైతుల సమస్యలు పై అధికారులకు తెలియజేసినందుకు బోనకల్ మండల రైతు సమన్వయ కమిటీ, మండల కమిటీ తరఫున రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కి రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.