పులుసుమామిడిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Published: Monday October 03, 2022
* సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 2 అక్టోబర్ ప్రజాపాలన : మహాత్మా గాంధీ సూచించిన ఆశయాలను ప్రతి పౌరుడు అనుసరించాలని పులుసుమామిడి గ్రామ సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోగల పులుసుమామిడి గ్రామంలో గ్రామ సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రాములు మహాత్మా గాంధీ 153 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి మాట్లాడుతూ పులుసు మామిడి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయుటకు కృషి చేస్తున్నానని తెలిపారు గ్రామంలో సిసి రోడ్లు అండర్ డ్రైనేజీలు 80% వరకు పూర్తి చేశానని స్పష్టం చేశారు. త్వరలో గ్రామంలోని అన్ని బావులపై జాలీలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. గ్రామ ప్రజలు ఎలాంటి సమస్య ఉన్నా నా దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.