రొంపిమల్ల లో ఇంటింటి సర్వే చేస్తున్న ఆర్డిఓ

Published: Wednesday February 23, 2022
దళిత బందు జాబితా పై తుది  కసరత్తు
మధిర: ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండల పరిధిలోని రొంపిమల్ల గ్రామంలో దళిత బంధు జాబితాకు తుది రూపం ఇచ్చేందుకు గాను ఆర్ డి ఓ గ్రామంలో మంగళవారం పర్యటించారు. రొంపిమల్ల గ్రామాన్ని దళిత బంధు కింద ఎంపిక చేసిన విషయం విదితమే. మధిర ఎం.ఎల్.ఎ సి ఎల్ పి లీడర్ మల్లు భట్టి విక్రమార్క సూచన, అందించిన లబ్దిదారుల జాబితా మేరకు  జిల్లా కలెక్టర్ సర్వే కు ఆదేశించారు. ఈ మేరకు జాబితాకు తుది రూపం ఇచ్చేందుకు గాను తొలిగా ఎంపిడివో తాసిల్దార్ నేతృత్వంలో లబ్ధిదారుల జాబితా పై కొద్దిరోజుల క్రితం సర్వే నిర్వహించారు. నేపథ్యంలో లబ్ధిదారులకు రుణాల మంజూరుకు గాను దళిత బంధు స్కీం నిబంధనల మేరకు లబ్ధిదారులు ఏ ఏ యూనిట్లను ఏర్పాటు చేయదలిచారో వాటికి సంబంధించిన వివరాలు ఆర్ డి ఓ రవీంద్రనాథ్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మదార్ సాహెబ్, వైస్ సర్పంచ్ గొల్లమందల సునీత, ఆర్ ఐ లు రమాదేవి, జయకృష్ణ, ఏ పి ఎం రాంబాబు తదితరులు ఉన్నారు.