బి.సి హక్కులకోసం ... చలో ఢిల్లీ - పోస్టర్ ఆవిష్కరణ

Published: Tuesday November 23, 2021

కొడిమ్యాల, నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలంలో నుండి డిసెంబర్ 13 బి సి గణన కోసం తెలంగాణ బి సి సంక్షేమం రాష్ట్ర అద్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలమేరకు చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్  ఆవిష్కరణ మండల కేంద్రంలో ని బస్టాండ్ ఆవరణలో అంబెడ్కర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు బి.సి జిల్లా సర్పంచుల ఫోరం అద్యక్షుడు సామంతుల ప్రభాకర్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం చెశారు. వారు మాట్లాడుతూ బి.సి బిల్లు పెట్టి 50 శాతం రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలి, ఏప్రిల్ 01 నుండి చేపట్టబోయే జనగణనలో కేంద్ర రాష్ట్ర బి.సి కులాలవారీగా లెక్కించాలి అని ఆన్నారు. ఈ కార్యక్రమంలో బి.సి మండల అద్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కడకుంట్ల శోభన్, జిల్లా యువజన కార్యదర్శి సభ్యులు మహిపాల, ముదిరాజ్ మండల అద్యక్షుడు పిట్టలశ్రీనివాస్, పిల్లి మల్లేశం, దొంతరవేణి నర్సయ్య, గడ్డమీది గంగయ్య, యువజన మండల అద్యక్షులు బైరికా ర్తీక్ కోలకాని సత్యం, ఆదిత్య, మొఱ్ఱిలింగమూర్తి, చెన్న నరేందర్, బొమ్మవేణు, లచ్చయ్య, అనుదీప్, రాజు, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.