ఇబ్రహీంపట్నం, జనవరి 04(ప్రజాపాలన ప్రతినిధి ): శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ చిక్కబల్లాపూర్
Published: Thursday January 05, 2023
ఇబ్రహీంపట్నం, జనవరి 04(ప్రజాపాలన ప్రతినిధి ): శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ చిక్కబల్లాపూర్ కర్ణాటక వారు పంపిణి చేసిన రాగి జావాను వర్షకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మండల విద్యాధికారి శ్రీ ఆనందరావు పంపిణి చేసారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థి కూడా ఎన్నడూ ఆకలితో పాఠశాలకు వెళ్ళకూడదు అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ను చేపట్టిన శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారు అభినందనీయులని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు రాజేందర్,కృష్ణ ప్రసాద్, మురళి, ఇమ్మానుయేల్, ఇబ్రహీం,మమత, లక్ష్మీ, భాగ్యలక్ష్మి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: