ఇబ్రహీంపట్నం, జనవరి 04(ప్రజాపాలన ప్రతినిధి ): శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ చిక్కబల్లాపూర్

Published: Thursday January 05, 2023

ఇబ్రహీంపట్నం, జనవరి 04(ప్రజాపాలన ప్రతినిధి ): శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ చిక్కబల్లాపూర్ కర్ణాటక వారు పంపిణి చేసిన రాగి జావాను వర్షకొండ  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థులకు  మండల విద్యాధికారి  శ్రీ ఆనందరావు  పంపిణి చేసారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న  ఏ ఒక్క విద్యార్థి కూడా ఎన్నడూ ఆకలితో పాఠశాలకు వెళ్ళకూడదు అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ను చేపట్టిన శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారు అభినందనీయులని తెలిపారు.ఈ కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు రాజేందర్,కృష్ణ ప్రసాద్, మురళి, ఇమ్మానుయేల్, ఇబ్రహీం,మమత, లక్ష్మీ, భాగ్యలక్ష్మి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.