పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు మహాధర్నా రాస్తారోకోలు
Published: Tuesday July 13, 2021
జగిత్యాల, జులై 12 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచిన ధరలు రాష్ట్ర ప్రభుత్వం టాక్షి రూపంలో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే డిజిల్ పెట్రోల్ ధరలు తగ్గించలని ఎడ్ల బండ్లు సైకిళ్లతో నిరసనాలు తెలిపి రాస్తారోకోలు చేశారు. పెట్రో డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించకపోతే నిరసనాలు తీవ్ర ఉదృతం చేస్తామని నినాదాలు చేస్తూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు గిరి నాగభూషణం బండ శంకర్ ధర రమేష్ బాబు నక్క జీవన్ కల్లెపల్లి దుర్గయ్య గాజుల రాజేందర్ గుండ మధు రఘువీర్ కిరణ్ కుమార్ జున్ను రాజేందర్ కట్ట శివ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: