ఇబ్రహీంపట్నం జూన్ తేది 7 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Wednesday June 08, 2022

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులుగా పి.జగన్*

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన పి.జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో మూడు రోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలో ఆయనను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో గత పది సంవత్సరాలుగా క్రీయాశీలకంగా పని చేస్తున్నానని, ఎస్ఎఫ్ఐ లో గ్రామ స్థాయి నుంచి మండల, డివిజన్, జిల్లా స్థాయి వరకు వివిధ బాధ్యతల్లో పని చేశానని. నేడు జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
విద్యారంగం సమస్యలపైన మరింత ఉధృత పోరాటాలు నిర్వహిస్తామని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, జిల్లాలో ఎస్ఎఫ్ఐ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.