లియో క్లబ్ అధ్యక్షుడు ఉపాధ్యక్షులు ఏర్పాటు

Published: Saturday November 26, 2022

మధిర రూరల్ నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) లైన్స్ క్లబ్ కు అనుబంధంగా మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం లియో క్లబ్ ఏర్పాటు చేశారు. స్థానిక డిగ్రీ కళాశాలలో లైన్స్ క్లబ్ సమావేశం నిర్వహించారు. అనంతరం లియో క్లబ్ అధ్యక్షుడిగా షారుఖ్ ఖాన్, ఉపాధ్యక్షుడిగా  సతీష్, కార్యదర్శిగా వర్జీనియా, కోశాధికారిగా అమరేశ్వర్ లను ఎన్నుకొని వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ తీగల మోహన్ రావు మాజీ జిల్లా గవర్నర్లు గోవిందరాజు, కాపా మురళీకృష్ణ, వి డి జి, సిహెచ్ శివప్రసాద్, ప్రోగ్రాం చైర్మన్ నంబూరి మధు హాజరై లైన్స్ క్లబ్ సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్ కార్యదర్శి కుంచం కృష్ణారావు లైన్స్ క్లబ్ జిల్లా నాయకులు డిసి వనమా విశ్వేశ్వరరావు మాజీ అధ్యక్షులు, చింటోజు నాగేశ్వరరావు మరియు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏఎన్ఎల్ శాస్త్రి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే రవికుమార్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కన్వీనర్ ఎస్ ఇందిర మరియు లయన్స్ మెంబర్స్ బుచ్చి రామారావు, వేములపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు