కొండముచ్చు ని పట్టుకున్న విసన్నపేట ప్రత్యేక టీం
Published: Friday December 17, 2021
మధిర డిసెంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : మధిర ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి కనిపించిన వారి పై దాడి చేసిన కొండముచ్చును విసన్నపేట ప్రత్యేక బృందంచే మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్ మరియు కమిషనర్ రమాదేవి ఆదేశాల మేరకు సైదా నాయక్ ఆధ్వర్యంలో విస్సన్నపేట బృందం ప్రత్యేక వలలు తో ఎట్టకేలకు కొండముచ్చులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు ఉదయం గోల్డ్ స్పాట్ సుబ్బారావు గోడౌన్ వెనుక ఖాళీ స్థలంలో కొండముచ్చుని పట్టుకున్న విస్సన్నపేట ప్రత్యేక టీం. గత పది రోజుల నుండి ప్రజల పై దాడి చేస్తున్న కొండముచ్చు లను పట్టుకునేందుకు శ్రమించిన మున్సిపాలిటీ పాలకమండలి ఎట్టకేలకు కొండముచ్చు లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పాలకమండలికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.
Share this on your social network: