బీరుపూర్ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన : ఎమ్మెల్యే సంజయ్ కుమార్,జడ్పీ చైర్ పర్సన్ వసంత
Published: Tuesday April 20, 2021
బీరుపూర్, ఏప్రిల్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : బీర్పూర్ ఎంపీపీ మసర్తి రమేష్ తండ్రి మాసర్తి నారాయణ (80) అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత పరామర్శించారు. వారివెంట కెడిసిసి జిల్లా డైరెక్టర్ ముప్పాల రామచందర్ రావు జిల్లా రైతుబంధు మెంబెర్ కొలుముల రమణ బీర్పూర్ సర్పంచ్ శిల్ప రమేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Share this on your social network: